కువైట్:ప్రతి బుధవారం ఓపెన్ హౌస్ మీటింగ్..భారత్ రాయబార కార్యాలయం ప్రకటన
- August 18, 2020
కువైట్ సిటీ:ఇక నుంచి ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. రేపు (ఆగస్ట్ 19) తొలి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలోనే నిర్వహించనున్నా ఓపెన్ హౌజ్ మీటింగ్ లో భారత రాయబారి/మిషన్ డిప్యూటీ అధికారి, సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్మిక శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు. అయితే..బుధవారపు ఓపెన్ హౌజ్ మీటింగులు..కౌన్సిలర్ ఆఫీస్ లో నిర్వహించే రోజువారి సమావేశాలకు అదనంగా నిర్వహిస్తున్నట్లు కూడా రాయబార కార్యాలయ అధికారులు స్పష్టతనిచ్చారు. ఇదిలాఉంటే కరోనా నేపథ్యంలో బుధవారపు సమావేశాలకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వివరించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతిస్తారు. [email protected].లో ముందుగా ఎవరు రిజస్టర్ చేసుకుంటే వారికే తొలిగా అనుమతి లభిస్తుంది. అనుమతికి సంబంధించి రిజిస్టర్ చేసుకున్న వారికి సమాచారం అందిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









