కువైట్:ప్రతి బుధవారం ఓపెన్ హౌస్ మీటింగ్..భారత్ రాయబార కార్యాలయం ప్రకటన
- August 18, 2020
కువైట్ సిటీ:ఇక నుంచి ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. రేపు (ఆగస్ట్ 19) తొలి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలోనే నిర్వహించనున్నా ఓపెన్ హౌజ్ మీటింగ్ లో భారత రాయబారి/మిషన్ డిప్యూటీ అధికారి, సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్మిక శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు. అయితే..బుధవారపు ఓపెన్ హౌజ్ మీటింగులు..కౌన్సిలర్ ఆఫీస్ లో నిర్వహించే రోజువారి సమావేశాలకు అదనంగా నిర్వహిస్తున్నట్లు కూడా రాయబార కార్యాలయ అధికారులు స్పష్టతనిచ్చారు. ఇదిలాఉంటే కరోనా నేపథ్యంలో బుధవారపు సమావేశాలకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వివరించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతిస్తారు. [email protected].లో ముందుగా ఎవరు రిజస్టర్ చేసుకుంటే వారికే తొలిగా అనుమతి లభిస్తుంది. అనుమతికి సంబంధించి రిజిస్టర్ చేసుకున్న వారికి సమాచారం అందిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







