కువైట్:ప్రతి బుధవారం ఓపెన్ హౌస్ మీటింగ్..భారత్ రాయబార కార్యాలయం ప్రకటన
- August 18, 2020
కువైట్ సిటీ:ఇక నుంచి ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. రేపు (ఆగస్ట్ 19) తొలి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలోనే నిర్వహించనున్నా ఓపెన్ హౌజ్ మీటింగ్ లో భారత రాయబారి/మిషన్ డిప్యూటీ అధికారి, సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్మిక శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారు. అయితే..బుధవారపు ఓపెన్ హౌజ్ మీటింగులు..కౌన్సిలర్ ఆఫీస్ లో నిర్వహించే రోజువారి సమావేశాలకు అదనంగా నిర్వహిస్తున్నట్లు కూడా రాయబార కార్యాలయ అధికారులు స్పష్టతనిచ్చారు. ఇదిలాఉంటే కరోనా నేపథ్యంలో బుధవారపు సమావేశాలకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వివరించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతిస్తారు. [email protected].లో ముందుగా ఎవరు రిజస్టర్ చేసుకుంటే వారికే తొలిగా అనుమతి లభిస్తుంది. అనుమతికి సంబంధించి రిజిస్టర్ చేసుకున్న వారికి సమాచారం అందిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







