తెలంగాణలో కొత్తగా 1,682 కరోనా కేసులు..
- August 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. నిన్న మరో 8 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 711కి చేరింది. నిన్న ఒక్కరోజే 2070 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 72,202 కు చేరింది. ఇంకా 21,024 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.14,110 మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఇండియాలో కరోనా రికవరీ రేటు 72.51 ఉండగా.. తెలంగాణలో 76.86 గా ఉంది.
నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 235 ,రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్ 107,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









