ఏ.పిలో 91 కరోనా మరణాలు
- August 21, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,544 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,940కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.మరోవైపు రాష్ట్రంలో గత 24 గంటల్లో మృతుల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో కొత్తగా 91 మంది వైరస్కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య 3,092కి పెరిగింది.
చిత్తూరు జిల్లాలో 16 మంది చనిపోగా, పశ్చిమ గోదావరిలో 13, నెల్లూరులో 12, తూర్పు గోదావరిలో 11, అనంతపురంలో 8, విశాఖపట్నంలో 6, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 4, గుంటూరులో 3, కృష్ణాలో 3, కర్నూలులో 3 మంది చొప్పున మృతిచెందారు. ఇదిలావుండగా రాష్ట్రంలో శుక్రవారం 8,827 మంది డిశ్చార్జ్ అవగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,44,045కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,803 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఏ.పిలో ఇప్పటివరకు 31 లక్షల 29 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







