యూఏఈలోని భారత వ్యాపారికి సత్కారం..అతని సేవలను ప్రశంసించిన యూఏఈ ప్రభుత్వం
- August 21, 2020
యూఏఈ:భారత్ కు చెందిన ఫిరోజ్ గౌలమ్ దాతృత్వానికి యూఏఈ ప్రభుత్వం ఫిదా అయ్యింది. యూఏఈలో బంగారం వ్యాపారం చేస్తున్న ఫిరోజ్..సమాజంలో నిరాదరణకు గురైన వారికి చేస్తున్న విశేష సేవలను గుర్తించి సత్కరించింది. పలువురు పోలీసులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఉప ప్రధాన మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫిరోజ్ కు ప్రశంస పత్రం అందజేసి గౌరవించారు. 2008 నుంచి ఫిరోజ్ యూఏలో బంగారు అభరణాల వ్యాపారం చేస్తున్నారు. పలు కారణాలతో శిక్షలు అనుభవిస్తూ జరిమానాలు కట్టలేక జైళ్లలోనే మగ్గుతున్న వారికి ఆయన ఎంతగానో సాయం చేశారు. విస్మరించబడిన సమాజం(ఫర్గాటన్ సొసైటీ) పేరుతో కొన్ని సంస్థలతో కలిసి ఆయన పలువురు ఖైదీలకు విముక్తి కలిగించారు. ఇందుకోసం ఖైదీలు బకాయిపడ్డ లక్షలాది డబ్బును చెల్లించారు. అంతేకాదు..తన దాతృత్వంతో జైలు నుంచి విడుదైన ప్రవాస ఖైదీలు..ఆ తర్వాత క్షేమంగా తమ దేశం చేరుకునేలా ఫిరోజ్ బాధ్యత తీసుకునేవాడు. వారికి ఉచితంగా విమాన టికెట్లు అందించి వారి స్వదేశానికి పింపించేవారు. ఫిరోజ్ దాతృత్వాన్ని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం అతని సేవలకు సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వ్యాపారి ఫిరోజ్..సమాజానికి తాను చేస్తున్న సాయాన్ని యూఏఈ ప్రభుత్వం గుర్తించి తనను గౌరవించటం పట్ల పాలకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. యూఏఈ ప్రభుత్వం తన సేవలను గుర్తించటం పట్ల గర్వంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







