తెలంగాణలో కొత్తగా 2,474 కరోనా పాజిటివ్ కేసులు
- August 22, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిని 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కు చేరింది. తాజాగా ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 744 కు చేరింది. కొత్తగా 1768 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,735 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం వెల్లడించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 77.29 శాతంగా ఉందని తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ 477, రంగారెడ్డి 201, నిజామాబాద్లో 153 నమోదయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







