డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
- August 26, 2020
న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. తాజాగా ఆయన తీవ్ర (డీప్)కోమాలోకి వెళ్లిపోయారని, వెంటిలేటర్ మద్దతుతో కృత్రిమ శ్వాస అందజేస్తున్నామని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ దవాఖాన బుధవారం తెలిపింది. మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో 16 రోజులుగా ప్రణబ్ దవాఖానలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ప్రణబ్కు చికిత్స అందజేస్తున్నామని, నిన్నటి నుంచి ఆయన మూత్రపిండాలు కూడా క్షీణిస్తున్నట్లు కనబడుతోందని వైద్యులు తెలిపారు. ఆగస్టు 10న ప్రణబ్కు అత్యవసర శస్త్రచికిత్స జరిగిన తరువాత ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య స్థితిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







