డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
- August 26, 2020
న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. తాజాగా ఆయన తీవ్ర (డీప్)కోమాలోకి వెళ్లిపోయారని, వెంటిలేటర్ మద్దతుతో కృత్రిమ శ్వాస అందజేస్తున్నామని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ దవాఖాన బుధవారం తెలిపింది. మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో 16 రోజులుగా ప్రణబ్ దవాఖానలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ప్రణబ్కు చికిత్స అందజేస్తున్నామని, నిన్నటి నుంచి ఆయన మూత్రపిండాలు కూడా క్షీణిస్తున్నట్లు కనబడుతోందని వైద్యులు తెలిపారు. ఆగస్టు 10న ప్రణబ్కు అత్యవసర శస్త్రచికిత్స జరిగిన తరువాత ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య స్థితిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







