కువైట్:ఇక నుంచి ఆన్ లైన్ లో కంపెనీల లైసెన్స్ రెన్యూవల్
- August 30, 2020
కువైట్ సిటీ:కంపెనీలు, పరిశ్రమల లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పులకు సంబంధించి ఇక నుంచి ఆన్ లైన్ సేవలు ప్రారంభించినట్లు కువైట్ వాణిజ్య, పారిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ బిజినెస్ సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. కంపెనీ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోదలిచిన వారు ముందుగా వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఏ తరహా కంపెనీ, సంస్థ అయితే..ఆ ఆప్షన్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అడ్రస్ మార్చుకునే వారు, ఒక వేళ రెన్యూవల్ తో పాటు అడ్రస్ మార్చుకోవాలనుకుంటే అందుకు సంబంధించిన వివరాలు, అనుబంధ డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్ లైన్ దరఖాస్తును పరిశీలించి సబంధిత అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత ఫీజు చెల్లించి లైసెన్స్ పొందవచ్చు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







