కువైట్:ఇక నుంచి ఆన్ లైన్ లో కంపెనీల లైసెన్స్ రెన్యూవల్
- August 30, 2020
కువైట్ సిటీ:కంపెనీలు, పరిశ్రమల లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పులకు సంబంధించి ఇక నుంచి ఆన్ లైన్ సేవలు ప్రారంభించినట్లు కువైట్ వాణిజ్య, పారిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ బిజినెస్ సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. కంపెనీ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోదలిచిన వారు ముందుగా వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఏ తరహా కంపెనీ, సంస్థ అయితే..ఆ ఆప్షన్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అడ్రస్ మార్చుకునే వారు, ఒక వేళ రెన్యూవల్ తో పాటు అడ్రస్ మార్చుకోవాలనుకుంటే అందుకు సంబంధించిన వివరాలు, అనుబంధ డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్ లైన్ దరఖాస్తును పరిశీలించి సబంధిత అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత ఫీజు చెల్లించి లైసెన్స్ పొందవచ్చు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







