కువైట్:ఇక నుంచి ఆన్ లైన్ లో కంపెనీల లైసెన్స్ రెన్యూవల్
- August 30, 2020
కువైట్ సిటీ:కంపెనీలు, పరిశ్రమల లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పులకు సంబంధించి ఇక నుంచి ఆన్ లైన్ సేవలు ప్రారంభించినట్లు కువైట్ వాణిజ్య, పారిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ బిజినెస్ సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. కంపెనీ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోదలిచిన వారు ముందుగా వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఏ తరహా కంపెనీ, సంస్థ అయితే..ఆ ఆప్షన్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అడ్రస్ మార్చుకునే వారు, ఒక వేళ రెన్యూవల్ తో పాటు అడ్రస్ మార్చుకోవాలనుకుంటే అందుకు సంబంధించిన వివరాలు, అనుబంధ డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్ లైన్ దరఖాస్తును పరిశీలించి సబంధిత అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత ఫీజు చెల్లించి లైసెన్స్ పొందవచ్చు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









