తెలంగాణలో కొత్తగా 2,924 కరోనా నమోదు పాజిటివ్ కేసులు
- August 30, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,090కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 818కి చేరింది. తాజాగా 1,638 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు.
ఇప్పటి వరకు మొత్తంగా 90, 988 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 31,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.43 శాతంగా ఉండగా.. తెలంగాణలో 73.9 శాతంగా ఉంది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా GHMCలో 461 నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 181, కరీంనగర్ 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!