అప్పటివరకు అంతర్జాతీయ విమానాలు తిరగవు

- August 31, 2020 , by Maagulf
అప్పటివరకు అంతర్జాతీయ విమానాలు తిరగవు

న్యూ ఢిల్లీ‌: అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధాన్ని పొడిగించారు.క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ ఫ్ల‌యిట్ల‌పై నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. కార్గో విమానాల‌కు ఇది వ‌ర్తించ‌దు అని కేంద్ర విమానయాన శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.DGCA అనుమ‌తి ఉన్న విమానాల‌కు కూడా ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు. ఎంపిక చేసిన రూట్ల‌లో మాత్రం అధికారిక అనుమ‌తి పొందిన అంత‌ర్జాతీయ విమానాల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 01 తేదీ నుంచి 30 వ‌ర‌కు ఆర‌వ ద‌శ వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. కోవిడ్-‌19 నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com