అప్పటివరకు అంతర్జాతీయ విమానాలు తిరగవు
- August 31, 2020
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగించారు.కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లయిట్లపై నిషేధాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్గో విమానాలకు ఇది వర్తించదు అని కేంద్ర విమానయాన శాఖ తన ప్రకటనలో పేర్కొంది.DGCA అనుమతి ఉన్న విమానాలకు కూడా ఈ నిబంధన వర్తించదు. ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అధికారిక అనుమతి పొందిన అంతర్జాతీయ విమానాలకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 01 తేదీ నుంచి 30 వరకు ఆరవ దశ వందేభారత్ మిషన్ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









