కరోనా నిబంధనలతో రెస్టారెంట్ బిజినెస్కి తీవ్ర నష్టం
- August 31, 2020
కువైట్ సిటీ:రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్, తమ వ్యాపారాలకు మరింత నష్టం వాటిల్లే ఎలాంటి నిబంధనల్నీ అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో తీసుకొచ్చిన నిబంధనలు రెస్టారెంట్ వ్యాపారానికి తీవ్ర నష్టం మిగిల్చాయనీ, చాలా రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయని అసోసియేషన్ పేర్కొంది. 60 ఏళ్ళ పైబడిన వ్యక్తులకు రెస్టారెంట్లలో పనిచేయడం నుంచి నిషేధం విధిస్తున్నట్లు విధించిన నిబంధనను అసోసియేషన్ ఇప్పటికే వ్యతిరేకిస్తూ మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కేటగిరీలోకి ఎక్కువమంది కార్మికులు వస్తారన్నది అసోసియేషన్ వాదన. కాగా, రెస్టారెంట్లు, సాప్లు అలాగే పేరలల్ మార్కెట్స్ని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిచ్చే దిశగా ఓ ప్రపోజల్ని ప్రభుత్వం తీసుకొస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రస్తుతం రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకు మూసివేయడం జరుగుతున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









