75 మంది ఉగ్రవాదులు హతo...
- February 09, 2016
ఇరాక్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన రమాదిలో సోమవారం 75 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతాదళాలు వెల్లడించాయి. రమాదిలో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న రెండు ప్రాంతాలను ఇరాక్ ప్రభుత్వ భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. రమాదికి పది కిలోమీటర్ల దూరంలో హుసైబా అల్-షర్ఖియా ప్రాంతంలో భద్రతాదళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. అయిదుగురు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దాదాపు 43 మంది మరణించగా, ఏడుగురు ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుబడ్డారు. నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 12 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.రమాది తూర్పు ప్రాంతంలోని జువిబాలో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 25 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాటం తర్వాత జువిబా జిల్లాలో పలు భవనాలపై ఇరాక్ దేశ జెండాను ఎగురవేశారు. రమాది నగరాన్ని ఐఎస్ ఉగ్రవాదులు గత ఏడాది స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







