సౌదీ అరేబియా: అంతర్జాతీయ విమాన సర్వీసుల సస్పెన్షన్ కొనసాగింపు
- September 03, 2020
రియాద్: సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ (సౌదియా), ఇంటర్నేషనల్ విమానాలకు సంబంధించి తదుపరి నోటీసు వరకు రద్దు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశం నుంచి వెళ్ళేందుకు సిద్ధమైన రెసిడెంట్స్ కోసం అవదాహ్ ఇనీషియేటివ్ ద్వారా మాత్రం విమానాలు నడుస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వలసదారులు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకోసం అవదాహ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అబ్షెర్ ప్లాట్ఫాం ద్వారా ఈ ఇనీషియేటివ్ చేపడుతున్నారు. ఇకిమా నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, సిటీ ఆఫ్ డిపాచర్యూర్ అండ్ ఎరైవల్ ఎయిర్పోర్ట్ వంటి వివరాల ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి వీలు కల్పించారు. కాగా, ప్రయాణీకులు అన్ని ఆరోగ్య నిబంధనలూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. యూఏఈ, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఈజిప్ట్, లెబనాన్, ట్యునీషియా, మొరాకో, చైనా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, గ్రీస్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, సుడాన్, ఇది¸యోపియా, కెన్యా, నైజీరియా మరియు ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన ట్రావెల్ రిక్వైర్మెంట్స్ వివరాల్ని సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ పబ్లిష్ చేస్తోంది. మార్చి 15న సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల్ని రద్దు చేసింది. డొమెస్టిక్ విమానాల్ని మే 31 నుంచి పునఃప్రారంభించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







