ఆఫీసులకు 70 శాతం గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ రావొచ్చు

- September 04, 2020 , by Maagulf
ఆఫీసులకు 70 శాతం గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ రావొచ్చు

మస్కట్‌: ప్రస్తుతం 30 శాతం మంది ఉద్యోగులు గవర్నమెంట్‌ కార్యాలయకు వస్తుండగా, దాన్ని మరింత పెంచారు. ఇకపై 70 శాతం మంది ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా సర్క్యులర్‌ జారీ చేశారు. సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌కి అందే ప్రభుత్వ సర్వీసుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ పేర్కొంది. కాగా, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ తప్పక కరోనా ప్రికాషన్స్‌ పాటించాల్సి వుంటుంది. 50 శాతం ఉద్యోగులు హాజరైన కొన్ని కార్యాలయాల్లో సరైన ప్రికాషన్స్‌ పాటించకపోవడంతో, కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారిన సందర్భాలున్నాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com