సౌదీ:టెర్రరిజం కేసులో ముగ్గురికి మరణ శిక్ష

- September 07, 2020 , by Maagulf
సౌదీ:టెర్రరిజం కేసులో ముగ్గురికి మరణ శిక్ష

రియాద్‌:సౌదీ అరేబియా క్రిమినల్‌ కోర్ట్‌, తీవ్రవాదంతో సంబంధం వుందన్న అభియోగాల నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. పలు బాంబు దాడుల్లో నిందితులకు సంబంధం వున్నట్లు నిరూపితమయ్యింది. మదీనాలో 2016 జులై 5న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వున్నట్లు విచారణలో తేలింది. నిందితులు సూసైడ్‌ బాంబర్‌కి పేలుడు పదార్థాలు కలిగిన బెల్ట్‌ని అందించినట్లు గుర్తించారు. డాక్టర్‌ సోలిమాన్‌ ఫకీహ్‌ హాస్పిటల్‌పై 2016 జులై 4న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వుందని తేలింది. ఇక్కడా సూసైడ్‌ బాంబర్‌ దాడికి పాల్పడ్డాడు. నిందితులు, తమ సహచరుడొకర్ని చంపేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com