సౌదీ:టెర్రరిజం కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- September 07, 2020
రియాద్:సౌదీ అరేబియా క్రిమినల్ కోర్ట్, తీవ్రవాదంతో సంబంధం వుందన్న అభియోగాల నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. పలు బాంబు దాడుల్లో నిందితులకు సంబంధం వున్నట్లు నిరూపితమయ్యింది. మదీనాలో 2016 జులై 5న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వున్నట్లు విచారణలో తేలింది. నిందితులు సూసైడ్ బాంబర్కి పేలుడు పదార్థాలు కలిగిన బెల్ట్ని అందించినట్లు గుర్తించారు. డాక్టర్ సోలిమాన్ ఫకీహ్ హాస్పిటల్పై 2016 జులై 4న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వుందని తేలింది. ఇక్కడా సూసైడ్ బాంబర్ దాడికి పాల్పడ్డాడు. నిందితులు, తమ సహచరుడొకర్ని చంపేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









