భారత్ కు 11 ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఖతార్ ఎయిర్ వేస్

- September 07, 2020 , by Maagulf
భారత్ కు 11 ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఖతార్ ఎయిర్ వేస్

దోహా:ఖతార్ ఎయిర్ వేస్ భారత్ కు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచే ఇండియాలోని 11 నగరాలకు సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 24 వరకు ఈ ప్రత్యేక విమాన సర్వీసులు కొనసాగుతాయి. అహ్మదాబాద్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, కోజికోడ్, ముంబై, తిరువనంతపురానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. భారత్ వెళ్లాలనుకునే వారు లేదంటే భారత్ నుంచి తిరిగి వచ్చే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఖతార్ ఎయిర్ వేస్ కోరింది. అయితే..ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించింది. అలాగే భారత్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచనలను కూడా ప్రయాణికులు దృష్టిలో ఉంచుకోవాలని, ప్రభుత్వ మార్గనిర్దేశకాలను అనుసరించాలని సూచించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com