బహ్రెయిన్ లో కొత్తగా 644 కరోనా కేసులు..సుల్తానేట్లో మరో నలుగురు మృతి
- September 08, 2020
మనామా:బహ్రెయిన్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే సుల్తానేట్ పరిధిలో కొత్తగా 644 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 55,415కి పెరిగింది. మరోవైపు వైరస్ బారిన పడి మరో నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురు మహిళలే. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్ లో కరోనా మరణాల సంఖ్య 200కి చేరింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా నమోదైన 644 కరోనా కేసులలో 87 మంది ప్రవాసీయులు ఉన్నారు. ఇదిలాఉంటే..కరోనా నుంచి నిన్న 301 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 50,946 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సుల్తానేట్ పరిధిలో 4,270 యాక్టీవ్ కేసులు ఉండగా..అందులో 90 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 32 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 10,459 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించామని, ఇప్పటివరకు సుల్తానేట్ వ్యాప్తంగా 11,72,808 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







