బహ్రెయిన్ లో కొత్తగా 644 కరోనా కేసులు..సుల్తానేట్లో మరో నలుగురు మృతి
- September 08, 2020
మనామా:బహ్రెయిన్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే సుల్తానేట్ పరిధిలో కొత్తగా 644 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 55,415కి పెరిగింది. మరోవైపు వైరస్ బారిన పడి మరో నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురు మహిళలే. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్ లో కరోనా మరణాల సంఖ్య 200కి చేరింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా నమోదైన 644 కరోనా కేసులలో 87 మంది ప్రవాసీయులు ఉన్నారు. ఇదిలాఉంటే..కరోనా నుంచి నిన్న 301 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 50,946 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సుల్తానేట్ పరిధిలో 4,270 యాక్టీవ్ కేసులు ఉండగా..అందులో 90 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 32 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 10,459 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించామని, ఇప్పటివరకు సుల్తానేట్ వ్యాప్తంగా 11,72,808 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









