వలసదారుల రీ-ఎంట్రీ వీసాల చెల్లుబాటుపై ఎక్స్టెన్షన్
- September 08, 2020
జెడ్డా: సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), వలసదారుల రీ-ఎంట్రీ వీసాల వ్యాలిడిటీని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది జవజాత్. రెసిడెంట్ పర్మిట్స్ (ఇకామా) గడువు తీరి, స్వదేశానికి రావాలనుకుంటున్న లేబరర్స్, డొమెస్టిక్ వర్కర్స్ కోసం ఈ గడువు పెంపుని ప్రకటించారు. సెప్టెంబర్ 30 వరకు ఈ పెంపు వర్తిస్తుంది. ఇకామా పొడిగింపులో కమర్షియల్ ప్రొఫెషన్స్లో పనిచేస్తున్నవారికి కూడా అవకాశం కల్పించారు. ఆగస్ట్ 1 నుంచి 31 లోపు గడువు తీరేవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. మార్చి 15 నుంచి సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









