వలసదారుల రీ-ఎంట్రీ వీసాల చెల్లుబాటుపై ఎక్స్టెన్షన్
- September 08, 2020
జెడ్డా: సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), వలసదారుల రీ-ఎంట్రీ వీసాల వ్యాలిడిటీని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది జవజాత్. రెసిడెంట్ పర్మిట్స్ (ఇకామా) గడువు తీరి, స్వదేశానికి రావాలనుకుంటున్న లేబరర్స్, డొమెస్టిక్ వర్కర్స్ కోసం ఈ గడువు పెంపుని ప్రకటించారు. సెప్టెంబర్ 30 వరకు ఈ పెంపు వర్తిస్తుంది. ఇకామా పొడిగింపులో కమర్షియల్ ప్రొఫెషన్స్లో పనిచేస్తున్నవారికి కూడా అవకాశం కల్పించారు. ఆగస్ట్ 1 నుంచి 31 లోపు గడువు తీరేవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. మార్చి 15 నుంచి సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు