తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్ కేసులు

- September 09, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,479 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,47,642కు చేరింది. ఈరోజు కరోనాతో 10 మంది మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రం మొత్తం మృతుల సంఖ్య 916కు చేరింది. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ 1,15,072 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 31,654 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, రికవరీ రేటు 77.9శాతంగా నమోదైంది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com