వాహనాల స్వాధీనానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన అబుధాబి పోలీసులు
- September 10, 2020
అబుధాబి:నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసే వారి వాహనాల స్వాధీనానికి సంబంధించి అబుధాబి పోలీసులు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేశారు. కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ఎవరైన వాహనదారుడు పోలీసుల వాహనాలను ఢీకొన్నా..పోలీస్ వాహనాల డ్యామేజ్ కి కారణమైనా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు డ్రైవర్ కి 50 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా రేసింగ్ లలో పాల్గొన్నా, సరైన నెంబర్ ప్లేట్ లేకున్నా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైనా, రోడ్ క్రాసింగ్ కు నిర్దేశించిన ప్రాంతాల్లో పాదాచారులకు దారి ఇవ్వకున్నా డ్రైవర్ కు 5,000 దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను ముందు సీటులో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేసినా 5,000 దిర్హామ్ ల ఫైన్ విధిస్తారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









