జీ20, కోవిడ్ 19 అంశాలపై ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు, భారత ప్రధాని
- September 10, 2020
రియాద్:సౌదీ అరేబియా రాజు సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో గత బుధవారం జీ20 సదస్సు, కరోనా మహమ్మారి అరికట్టే చర్యలపై ఫోన్ లో చర్చించారు. నవంబర్ సౌదీ వేదికగా జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన రాజు సల్మాన్..పలు సవాళ్లపై జీ20 సభ్య దేశాల పని తీరుపై చర్చించుకున్నారు. అలాగే కరోనా మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లు, వైరస్ ప్రభావాన్ని తగ్గించే మార్గాలకు సంబంధించి డిస్కస్ చేసుకున్నారు. జీ20 సభ్య దేశాలు కరోనా వైరస్ పై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని సౌదీ రాజు సల్మాన్ గుర్తు చేశారు. ప్రపంచ అర్ధిక గమనానికి దోహదం చేసేలా మహమ్మారిని నియంత్రించాల్సిన ప్రధాన్యతను మోదీతో పంచుకున్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది జీ 20 సదస్సుకు విశిష్ట నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. జీ20 సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు మేలు జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణల సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల అభివృద్ధి ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్









