జీ20, కోవిడ్ 19 అంశాలపై ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు, భారత ప్రధాని
- September 10, 2020
రియాద్:సౌదీ అరేబియా రాజు సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో గత బుధవారం జీ20 సదస్సు, కరోనా మహమ్మారి అరికట్టే చర్యలపై ఫోన్ లో చర్చించారు. నవంబర్ సౌదీ వేదికగా జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన రాజు సల్మాన్..పలు సవాళ్లపై జీ20 సభ్య దేశాల పని తీరుపై చర్చించుకున్నారు. అలాగే కరోనా మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లు, వైరస్ ప్రభావాన్ని తగ్గించే మార్గాలకు సంబంధించి డిస్కస్ చేసుకున్నారు. జీ20 సభ్య దేశాలు కరోనా వైరస్ పై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని సౌదీ రాజు సల్మాన్ గుర్తు చేశారు. ప్రపంచ అర్ధిక గమనానికి దోహదం చేసేలా మహమ్మారిని నియంత్రించాల్సిన ప్రధాన్యతను మోదీతో పంచుకున్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది జీ 20 సదస్సుకు విశిష్ట నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. జీ20 సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు మేలు జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణల సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల అభివృద్ధి ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించుకున్నారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







