జీ20, కోవిడ్ 19 అంశాలపై ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు, భారత ప్రధాని
- September 10, 2020
రియాద్:సౌదీ అరేబియా రాజు సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో గత బుధవారం జీ20 సదస్సు, కరోనా మహమ్మారి అరికట్టే చర్యలపై ఫోన్ లో చర్చించారు. నవంబర్ సౌదీ వేదికగా జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన రాజు సల్మాన్..పలు సవాళ్లపై జీ20 సభ్య దేశాల పని తీరుపై చర్చించుకున్నారు. అలాగే కరోనా మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లు, వైరస్ ప్రభావాన్ని తగ్గించే మార్గాలకు సంబంధించి డిస్కస్ చేసుకున్నారు. జీ20 సభ్య దేశాలు కరోనా వైరస్ పై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని సౌదీ రాజు సల్మాన్ గుర్తు చేశారు. ప్రపంచ అర్ధిక గమనానికి దోహదం చేసేలా మహమ్మారిని నియంత్రించాల్సిన ప్రధాన్యతను మోదీతో పంచుకున్నారు. ఇదిలాఉంటే ఈ ఏడాది జీ 20 సదస్సుకు విశిష్ట నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. జీ20 సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు మేలు జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణల సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల అభివృద్ధి ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!