బహ్రెయిన్ లో పెరుగుతున్న వైరస్ తీవ్రత..ప్రజలు గుమికూడొద్దని అధికారుల సూచన
- September 11, 2020
బహ్రెయిన్ లో కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం కరోనా వ్యాప్తి నియంత్రణకు పలు సూచనలు చేసింది. మరో రెండు వారాల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా గుమికూడొద్దని హెచ్చరించింది. అంతేకాదు..పరిస్థితి అదుపులోకి రాకుంటే భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరిన్ని ఆంక్షలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా సంకేతాలిచ్చింది. ఇటీవల పలు కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడిన ఘటనల వల్లే కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోందని ఎపిడెమియోలాజికల్ సర్వేలో తేటతెల్లమైంది. ఇదిలాఉంటే.. బహ్రెయిన్ లో ఇప్పటివరకు 57,540 వైరస్ కేసులు నమోదవగా...204 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







