బహ్రెయిన్ లో పెరుగుతున్న వైరస్ తీవ్రత..ప్రజలు గుమికూడొద్దని అధికారుల సూచన

- September 11, 2020 , by Maagulf
బహ్రెయిన్ లో పెరుగుతున్న వైరస్ తీవ్రత..ప్రజలు గుమికూడొద్దని అధికారుల సూచన

బహ్రెయిన్ లో కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం కరోనా వ్యాప్తి నియంత్రణకు పలు సూచనలు చేసింది. మరో రెండు వారాల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా గుమికూడొద్దని హెచ్చరించింది. అంతేకాదు..పరిస్థితి అదుపులోకి రాకుంటే భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరిన్ని ఆంక్షలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా సంకేతాలిచ్చింది. ఇటీవల పలు కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడిన ఘటనల వల్లే కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోందని ఎపిడెమియోలాజికల్ సర్వేలో తేటతెల్లమైంది. ఇదిలాఉంటే.. బహ్రెయిన్ లో ఇప్పటివరకు 57,540 వైరస్ కేసులు నమోదవగా...204 మంది మృతి చెందారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com