బహ్రెయిన్ లో పెరుగుతున్న వైరస్ తీవ్రత..ప్రజలు గుమికూడొద్దని అధికారుల సూచన
- September 11, 2020
బహ్రెయిన్ లో కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం కరోనా వ్యాప్తి నియంత్రణకు పలు సూచనలు చేసింది. మరో రెండు వారాల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా గుమికూడొద్దని హెచ్చరించింది. అంతేకాదు..పరిస్థితి అదుపులోకి రాకుంటే భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరిన్ని ఆంక్షలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా సంకేతాలిచ్చింది. ఇటీవల పలు కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడిన ఘటనల వల్లే కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోందని ఎపిడెమియోలాజికల్ సర్వేలో తేటతెల్లమైంది. ఇదిలాఉంటే.. బహ్రెయిన్ లో ఇప్పటివరకు 57,540 వైరస్ కేసులు నమోదవగా...204 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







