భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకునే అవకాశం
- September 12, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. వరుసగా రెండోరోజు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో 95వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఈ సమయంలో 12 వందల మంది మృతిచెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45 లక్షలకు చేరింది. మరణాలు రేటు 1.67కు పడిపోయిందని.. రికవరీ రేటు 77.65కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు మృతుల సంఖ్య దేశంలో 75వేలు దాటింది. కొత్త కేసుల్లో 57 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్లోనే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా హాట్ స్పాట్గా ఉన్న మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది. కరోనా కేసుల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న రష్యాతో పోటీపడుతోంది. అక్టోబర్ మొదటి వారానికి భారత్లో కేసులు 70 లక్షలు దాటుతాయని.. బాధితుల సంఖ్య అమెరికాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్ బిట్స్ పిలానీ పరిశోధకులు పేర్కొన్నారు. భారత్లో కరోనా వ్యాప్తి తీరుపై ఆ బృందం అధ్యయనం చేసింది. నిర్వహించే పరీక్షల సంఖ్య ఆధారంగా కేసుల తీరు ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







