ఇజ్రాయెల్తో బహ్రెయిన్ సన్నిహిత సంబంధాలు
- September 12, 2020
మనామా:ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలకు సంబంధించి బహ్రెయిన్ కూడా కీలకమైన ముందడుగు వేయనుంది. అమెరికా అఫధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచన మేరకు యూఏఈ ఇప్పటికే, ఇజ్రాయెల్తో చారిత్రక ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే. తాజాగా బహ్రెయిన్ కూడా ఆ కోవలో చేరనుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహా, బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఒకేసారి ఫోన్లో మాట్లాడారు డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఓ ఒప్పందం మూడు దేశాల మధ్యా కుదిరింది. ఈ క్రమంలో ట్రంప్ మరో డిప్లమాటిక్ విక్టరీని నమోదు చేసినట్లయ్యింది. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై తీవ్రవాద దాడి జరిగిన 19 ఏళ్ళ తర్వాత.. అదే రోజున ట్రంప్ చారిత్రక విజయాన్ని సాధించారు బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య సన్నిహిత సంబంధాలను నెలకొల్పడం ద్వారా.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!