విజిట్ వీసా గడువు తీరినా,యూఏఈలో వుండిపోయేవారికి జరీమానా
- September 12, 2020
యూఏఈ:విజిటర్స్ లేదా టూరిస్టులు, మార్చి 1 తర్వాత వీసా గడువు తీరిపోయినప్పటికీ ఇంకా దేశంలోనే వుండిపోతే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెప్టెంబర్ 11 నుంచి జరీమానాలు ప్రారంభమవుతాయి. ఓవర్స్టే జరీమానా తొలి రోజుకి 200 దిర్హాములు వుంటుందని అమెర్ సెల్ సెంటర్ ఏజెంట్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టుల వద్ద ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ మొత్తాన్ని లెక్కిస్తారు. ప్రతి అదనపు రోజుకీ 100 దిర్హాములు అలాగే సర్వీస్ ఫీజు కింద 1000 దిర్హాములు వసూలు చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 11న నెల రోజులపాటు గడువు పొడిగించగా, అది సెప్టెంబర్ 11తో ముగిసింది. ఎలాంటి అదనపు పొడిగింపూ ఇకపై వుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విజిట్ వీసా వున్నవారు తమ స్టేటస్ని మార్చుకోవాలి లేదంటే, దేశం విడిచి వెళ్ళాల్సిందిగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







