కోట కు సత్కారం
- May 25, 2015
జీపీ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే-27 బుధవారం సాయంత్రం 4గంటలకు త్యాగరాయగానసభలో ప్రముఖ నటుడు పద్మశ్రీ కోటశ్రీనివాసరావుకు సత్కారం జరగనుంది.విశ్వవిఖ్యాత నటరసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ -జీపీఆర్ జీవితసాఫల్య పురస్కారాన్ని కోటశ్రీనివాసరావుకు ప్రదానం చేయడం జరుగుతుందని జీపీఆర్ట్స్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పి.నాగేంద్రరావు, జి.శ్రీనివాసనాయుడు పత్రికాప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, డాక్టర్.నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వంశీరామరాజు, ,మాశర్మ, గుండు హనుమంతరావు, జి.హనుమంతరావు, కే.మధుబాల, అంజనారెడ్డి, మహ్మద్ఫ్రీ, డాక్టర్ కళావెంకటదీక్షితులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీసంగీత విభావరి ఉంటుందని వారు చెప్పారు.వంశీ ఆర్ట్ థియేటర్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







