సరైనా రెసిడెన్సీ వీసా ఉండి ఇంకా విదేశాల్లోనే 4,26,871 మంది ప్రవాసీయులు
- September 13, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ తో కువైట్ వీసాదారులు ఇంకా వివిధ దేశాల్లో చిక్కుకుపోయారని..ఆగస్ట్ 23 నాటికి 4,26,871 మంది ప్రవాసీయులు సరైన రెసిడెన్సీ పర్మిట్ వీసా కలిగి ఉండి ఇంకా కువైట్ చేరుకోలేదని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అయితే..వీసా గడువు ముగిసిన వారిని మాత్రం సుల్తానేట్లోకి అనుమతించబోమని ప్రవాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తదుపరి అనుమతి వచ్చే వరకు విదేశీయులు ఎవరికి కొత్త వీసాలను జారీ చేయబోమని కూడా తెలిపారు. ఇక వీసా గడువు ముగిసినా ఇంకా దేశం విడిచి వెళ్లని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వారికి అనుమతించిన క్షమాభిక్ష గడువు ముగిసినందువల్ల చట్టపరమైన చర్యలతో పాటు..వారిని సుల్తానేట్ నుంచి పంపించివేస్తామని, మళ్లీ కువైట్ వచ్చేందుకు అనర్హులు అవుతారని వెల్లడించారు. ఇదిలాఉంటే..ప్రవాసీయులకు సంబంధించి ప్రవాసీ చట్ట సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, నివేదికను రూపొందించి సంబంధిత అధికారులకు పంపిస్తామని..వారు ఆమోదం తెలుపాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కువైట్ రెసిడెన్సీ వీసా కలిగి ఉండి ఇండియాలోనే చిక్కకుపోయిన ప్రవాసీయులు తిరిగి కువైట్ వెళ్లాలని అనుకుంటే ఎంబసీలో రిజిస్టర్ చేసుకోవాలని రాబాబార కార్యాలయం వెల్లడించింది. అయితే..ఈ ప్రక్రియ కేవలం ప్రవాసీయుల వివరాల సేకరణ కోసమేనని కూడా రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు