సరైనా రెసిడెన్సీ వీసా ఉండి ఇంకా విదేశాల్లోనే 4,26,871 మంది ప్రవాసీయులు
- September 13, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ తో కువైట్ వీసాదారులు ఇంకా వివిధ దేశాల్లో చిక్కుకుపోయారని..ఆగస్ట్ 23 నాటికి 4,26,871 మంది ప్రవాసీయులు సరైన రెసిడెన్సీ పర్మిట్ వీసా కలిగి ఉండి ఇంకా కువైట్ చేరుకోలేదని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అయితే..వీసా గడువు ముగిసిన వారిని మాత్రం సుల్తానేట్లోకి అనుమతించబోమని ప్రవాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తదుపరి అనుమతి వచ్చే వరకు విదేశీయులు ఎవరికి కొత్త వీసాలను జారీ చేయబోమని కూడా తెలిపారు. ఇక వీసా గడువు ముగిసినా ఇంకా దేశం విడిచి వెళ్లని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వారికి అనుమతించిన క్షమాభిక్ష గడువు ముగిసినందువల్ల చట్టపరమైన చర్యలతో పాటు..వారిని సుల్తానేట్ నుంచి పంపించివేస్తామని, మళ్లీ కువైట్ వచ్చేందుకు అనర్హులు అవుతారని వెల్లడించారు. ఇదిలాఉంటే..ప్రవాసీయులకు సంబంధించి ప్రవాసీ చట్ట సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, నివేదికను రూపొందించి సంబంధిత అధికారులకు పంపిస్తామని..వారు ఆమోదం తెలుపాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కువైట్ రెసిడెన్సీ వీసా కలిగి ఉండి ఇండియాలోనే చిక్కకుపోయిన ప్రవాసీయులు తిరిగి కువైట్ వెళ్లాలని అనుకుంటే ఎంబసీలో రిజిస్టర్ చేసుకోవాలని రాబాబార కార్యాలయం వెల్లడించింది. అయితే..ఈ ప్రక్రియ కేవలం ప్రవాసీయుల వివరాల సేకరణ కోసమేనని కూడా రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్







