సరైనా రెసిడెన్సీ వీసా ఉండి ఇంకా విదేశాల్లోనే 4,26,871 మంది ప్రవాసీయులు
- September 13, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ తో కువైట్ వీసాదారులు ఇంకా వివిధ దేశాల్లో చిక్కుకుపోయారని..ఆగస్ట్ 23 నాటికి 4,26,871 మంది ప్రవాసీయులు సరైన రెసిడెన్సీ పర్మిట్ వీసా కలిగి ఉండి ఇంకా కువైట్ చేరుకోలేదని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అయితే..వీసా గడువు ముగిసిన వారిని మాత్రం సుల్తానేట్లోకి అనుమతించబోమని ప్రవాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తదుపరి అనుమతి వచ్చే వరకు విదేశీయులు ఎవరికి కొత్త వీసాలను జారీ చేయబోమని కూడా తెలిపారు. ఇక వీసా గడువు ముగిసినా ఇంకా దేశం విడిచి వెళ్లని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వారికి అనుమతించిన క్షమాభిక్ష గడువు ముగిసినందువల్ల చట్టపరమైన చర్యలతో పాటు..వారిని సుల్తానేట్ నుంచి పంపించివేస్తామని, మళ్లీ కువైట్ వచ్చేందుకు అనర్హులు అవుతారని వెల్లడించారు. ఇదిలాఉంటే..ప్రవాసీయులకు సంబంధించి ప్రవాసీ చట్ట సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, నివేదికను రూపొందించి సంబంధిత అధికారులకు పంపిస్తామని..వారు ఆమోదం తెలుపాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కువైట్ రెసిడెన్సీ వీసా కలిగి ఉండి ఇండియాలోనే చిక్కకుపోయిన ప్రవాసీయులు తిరిగి కువైట్ వెళ్లాలని అనుకుంటే ఎంబసీలో రిజిస్టర్ చేసుకోవాలని రాబాబార కార్యాలయం వెల్లడించింది. అయితే..ఈ ప్రక్రియ కేవలం ప్రవాసీయుల వివరాల సేకరణ కోసమేనని కూడా రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







