కోవిడ్ 19: పీసీఆర్ టెస్ట్ ధరను కేవలం 250 దిర్హామ్ లకు తగ్గించిన దుబాయ్

- September 13, 2020 , by Maagulf
కోవిడ్ 19: పీసీఆర్ టెస్ట్ ధరను కేవలం 250 దిర్హామ్ లకు తగ్గించిన దుబాయ్

దుబాయ్:కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేలా దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజలకు ఆర్ధిక భారంగా మారకుండా పీసీఆర్ టెస్ట్ ధరలను 250 దిర్హామ్ లకు తగ్గించింది. టెస్ట్ ధరలను తక్కించటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. తద్వారా కరోనా నియంత్రణ చర్యలను ప్రొత్సహించినట్లు అవుతుందన్నారు. కరోనాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో దుబాయ్ ఆరోగ్య శాఖ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోదని ఈ సందర్భంగా దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com