జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా
- September 15, 2020
టోక్యో:జపాన్ అధికార పార్టీకి నూతన రధసారథిగా యోషిహిడే సుగాను ఎన్నికయ్యారు. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించింది. దీంతో జపాన్ క్యాబినెట్ ముఖ్య కార్యదర్శి యోషిహిడే సుగా దేశ తదుపరి ప్రధానిగా అవతరించనున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డిపి) చట్టసభ సభ్యులు , ప్రాంతీయ ప్రతినిధులు వేసిన 534 చెల్లుబాటు అయ్యే ఓట్లలో 377 ని సాధించి, సుగా తన ఇద్దరు ప్రత్యర్థుల కంటే గణనీయంగా ముందువరుసలో నిలిచారు. ఉత్తర జపాన్ లోని గ్రామీణ అకిటాలో స్ట్రాబెర్రీ రైతు కుమారుడైన సుగా.. అక్కడ హైస్కూల్ విద్య అనంతరం టోక్యోకు వెళ్లారు.. అనంతరం నైట్ కాలేజీలో కాలేజీ విద్య పూర్తి చేశారు. ఆ తరువాత టోక్యో లోని యోకోహామాలో మునిసిపల్ అసెంబ్లీ సభ్యుడిగా 1987లో ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ప్రధాని పదవిని అధిరోహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







