తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు

- September 15, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 277 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి 143, కరీంనగర్‌లో 135 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో కరోనా కేసులు 1,60,571కి చేరాయి. ఇందులో 129,187 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 984 మంది మరణించారు. 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com