కువైట్:సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి పొడిగింపు లేదు
- September 15, 2020
కువైట్ సిటీ: కువైట్ లో కువైట్ ప్రభుత్వం మార్చిలో రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి మహమ్మారి కరోనా నేపథ్యంలో నవంబర్ చివరి వరకు గ్రేస్ పిరీయడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ వల్ల ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచడంతో పొడిగింపు చేసుకోలేకపోయారనే కారణంతో వీరికి నవంబర్ వరకు పొడిగింపు ఇవ్వడం జరిగింది.అయితే, ఈ పొడిగింపు సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి వర్తించదని తాజాగా కువైట్ ప్రభుత్వం వెల్లడించింది.ఒకవేళ సెప్టెంబర్ 1 తర్వాత రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు పొడిగింపు చేసుకోకుంటే రోజుకి 2 కువైట్ దినార్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.రెసిడెన్సీ వ్యవహారాల శాఖ వారు జూన్ చివరి నుంచే వీసా పునరుద్ధరణ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు కనుక సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారు తమ వీసాలను పునరుద్ధరించుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







