కువైట్:సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి పొడిగింపు లేదు
- September 15, 2020కువైట్ సిటీ: కువైట్ లో కువైట్ ప్రభుత్వం మార్చిలో రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి మహమ్మారి కరోనా నేపథ్యంలో నవంబర్ చివరి వరకు గ్రేస్ పిరీయడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ వల్ల ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచడంతో పొడిగింపు చేసుకోలేకపోయారనే కారణంతో వీరికి నవంబర్ వరకు పొడిగింపు ఇవ్వడం జరిగింది.అయితే, ఈ పొడిగింపు సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి వర్తించదని తాజాగా కువైట్ ప్రభుత్వం వెల్లడించింది.ఒకవేళ సెప్టెంబర్ 1 తర్వాత రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు పొడిగింపు చేసుకోకుంటే రోజుకి 2 కువైట్ దినార్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.రెసిడెన్సీ వ్యవహారాల శాఖ వారు జూన్ చివరి నుంచే వీసా పునరుద్ధరణ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు కనుక సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారు తమ వీసాలను పునరుద్ధరించుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు