కువైట్:సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి పొడిగింపు లేదు
- September 15, 2020
కువైట్ సిటీ: కువైట్ లో కువైట్ ప్రభుత్వం మార్చిలో రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి మహమ్మారి కరోనా నేపథ్యంలో నవంబర్ చివరి వరకు గ్రేస్ పిరీయడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ వల్ల ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచడంతో పొడిగింపు చేసుకోలేకపోయారనే కారణంతో వీరికి నవంబర్ వరకు పొడిగింపు ఇవ్వడం జరిగింది.అయితే, ఈ పొడిగింపు సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారికి వర్తించదని తాజాగా కువైట్ ప్రభుత్వం వెల్లడించింది.ఒకవేళ సెప్టెంబర్ 1 తర్వాత రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు పొడిగింపు చేసుకోకుంటే రోజుకి 2 కువైట్ దినార్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.రెసిడెన్సీ వ్యవహారాల శాఖ వారు జూన్ చివరి నుంచే వీసా పునరుద్ధరణ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు కనుక సెప్టెంబర్ 1 తర్వాత వీసా గడువు ముగిసిన వారు తమ వీసాలను పునరుద్ధరించుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







