వాక్సిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కో-ఆపరేషన్‌పై ఒమన్‌ - ఇండియా చర్చలు

- September 15, 2020 , by Maagulf
వాక్సిన్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కో-ఆపరేషన్‌పై ఒమన్‌ - ఇండియా చర్చలు

మస్కట్‌: మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అల్‌ సీదీ, ఒమన్‌లో భారత రాయబారి అయిన మను మహావర్‌కి సాదరంగా ఆమ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఒమన్‌ - భారత్‌ మిత్రదేశాలనీ, కరోనా నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా సంపూర్ణ సహాయ సహకారాలు చోటు చేసుకున్నాయని ఇరువురూ పేర్కొన్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్‌ తయారీ, ప్రొక్యూర్‌మెంట్‌, సహకారం వంటి విషయాలపై ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంలో సుల్తానేట్‌ చాలా ప్రత్యేకత కలిగిన, సమర్థవంతమైన, సేఫ్‌ ప్లేస్‌ అని హెల్త్‌ మినిస్టర్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com