తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతి పట్ల ఎపి గవర్నర్ దిగ్భ్రాంతి
- September 16, 2020
విజయవాడ:తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా దుర్గాప్రసాద్ ప్రజాసేవలో అవిరళ కృషి చేశారన్నారు. బల్లి దుర్గా ప్రసాద్ రావు సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గవర్నర్ హరిచందన్ అన్నారు. ప్రసాద్ రావు 28 సంవత్సరాల వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యారని ప్రస్తుతించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్న బిశ్వ భూషణ్, దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ మేరకు రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







