తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతి పట్ల ఎపి గవర్నర్ దిగ్భ్రాంతి
- September 16, 2020విజయవాడ:తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా దుర్గాప్రసాద్ ప్రజాసేవలో అవిరళ కృషి చేశారన్నారు. బల్లి దుర్గా ప్రసాద్ రావు సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గవర్నర్ హరిచందన్ అన్నారు. ప్రసాద్ రావు 28 సంవత్సరాల వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యారని ప్రస్తుతించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్న బిశ్వ భూషణ్, దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ మేరకు రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్