కువైట్ లో కొత్తగా మరో 698 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- September 16, 2020
కువైట్ సిటీ:ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. కువైట్ లో 24 గంటల్లో కొత్తగా మరో 698 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన బులెటిన్ లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 96, 999 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో మరో ముగ్గురు మరణించటంతో మృతుల సంఖ్య 571కి చేరింది. అయితే..కరోనా పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో మరో 968 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 87,187కి పెరిగింది. ప్రస్తుతం 9,241 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







