కువైట్ లో కొత్తగా మరో 698 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

- September 16, 2020 , by Maagulf
కువైట్ లో కొత్తగా మరో 698 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

కువైట్ సిటీ:ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. కువైట్ లో 24 గంటల్లో కొత్తగా మరో 698 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన బులెటిన్ లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 96, 999 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో మరో ముగ్గురు మరణించటంతో మృతుల సంఖ్య 571కి చేరింది. అయితే..కరోనా పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో మరో 968 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 87,187కి పెరిగింది. ప్రస్తుతం 9,241 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com