కువైట్ లో కొత్తగా మరో 698 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- September 16, 2020కువైట్ సిటీ:ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. కువైట్ లో 24 గంటల్లో కొత్తగా మరో 698 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన బులెటిన్ లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 96, 999 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో మరో ముగ్గురు మరణించటంతో మృతుల సంఖ్య 571కి చేరింది. అయితే..కరోనా పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో మరో 968 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 87,187కి పెరిగింది. ప్రస్తుతం 9,241 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం