ఇంటర్నేషనల్‌ ఎరైవల్స్‌కి కోవిడ్‌ 19 ట్రాకింగ్‌ డివైజ్‌ తప్పనిసరి

- September 18, 2020 , by Maagulf
ఇంటర్నేషనల్‌ ఎరైవల్స్‌కి కోవిడ్‌ 19 ట్రాకింగ్‌ డివైజ్‌ తప్పనిసరి

అబుధాబి:అబుధాబి ఎయిర్‌ పోర్ట్‌ ద్వారా వచ్చే ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్స్‌, కరోనా వైరస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ని తప్పక ధరించాలని, 14 రోజుల మాండేటరీ క్వారంటైన్‌ని పూర్తి చేయాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ స్పష్టం చేసింది. కాగా, యూఏఈలో ఇటీవల డెయిలీ ఇన్‌ఫెక్షన్స్‌ పెరుగుతున్న దరిమిలా అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు సమాయత్తమవుతున్నారు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించకపోవడమే కరోనా వ్యాప్తికి కారణమని అధికారులు అంటున్నారు.అబుధాబి ఎయిర్‌ పోర్ట్‌ ద్వారా వచ్చే ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, 14 రోజుల హోం క్వారంటైన్‌ని విధిస్తున్నారు. గడచిన రెండు వారాల్లో నమోదైన కేసుల్లో 88 శాతం కేసులు గేదరింగ్స్‌ వల్ల వచ్చినవేననీ, వీటిల్లో 12 శాతం కేసులు అంతర్జాతీయ ప్రయాణికులకి సంబంధించినవని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటిదాకా యూఏఈలో 82,568 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 402 మంది ప్రాణాలు కోల్పోయారు.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com