రియాద్-లక్నో: భారీగా బంగారం పట్టివేత

- September 18, 2020 , by Maagulf
రియాద్-లక్నో: భారీగా బంగారం పట్టివేత

లక్నో:అక్రమ బంగారం రవాణాకు కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట పడటం లేదు. ఏదో ఒక రూపంలో బంగారాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా భారీగా విదేశాల నుంచి బంగారాన్ని తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా లక్నో కస్టమ్స్ అధికారులకు ఏకంగా రూ. 2 కోట్లు విలువ చేసే 3.8కిలోల బంగారం పట్టుబడింది. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన జరిగింది. రియాద్ నుంచి  లక్నో జీ8 6451 విమానంలో  వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా, భారీ మొత్తంలో బంగారం దొరికింది. మొత్తం 33 గోల్డ్ బిస్కెట్లను ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గోల్డ్ 3,849.12 గ్రాములని, మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 2 కోట్ల 9 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, నిందితుడు గోల్డ్ బిస్కెట్లను సెల్లోటేప్‌లో చుట్టి, అతని అండర్ గార్మెంట్‌లోని నల్ల రంగు పర్సులో దాచి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com