దుబాయ్ నుంచి స్వదేశానికి 93 మంది ప్రవాస భారతీయులు
- September 20, 2020
చండీగఢ్:కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టి ‘వందే భారత్ మిషన్’ విజయవంతమవుతోంది. ఇందులో భాగంగా దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం 96 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. శనివారం సాయంత్రం 4.13 గంటలకు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం చేరుకుంది. వీరిలో చాలా మంది పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు ఆయా రాష్ట్రాల క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని అధికారలుు తెలియజేశారు. విమానాశ్రయానికి చేరుకున్న 96 మంది ప్రయాణికుల్లో ఏ ఒక్కరిలో కూడా జ్వరం, దగ్గు, జలుబు వంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ బృందాలు ప్రయాణికులను ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తున్నారు. స్వదేశానికి చేరుకున్నాక, వారు తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







