ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- December 21, 2025
మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) తన ప్లాటినం జూబ్లీ ఇయర్ కల్చరల్ ఫెస్టివల్ టిక్కెట్ల అమ్మకాలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో జయాని మోటార్స్ జనరల్ మేనేజర్ రిజ్వాన్ తారిఖ్, స్కూల్ చైర్మన్ అడ్వకేట్ బిను మన్నిల్ వరుగేసే, స్టార్ విజన్ చైర్మన్ సేతురాజ్ కడక్కల్ తదితరులు పాల్గొని ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ కన్వీనర్ ఆర్. రమేష్కు తొలి టిక్కెట్లను అందజేశారు.
జనవరి 15 మరియు 16 తేదీలలో సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ఈ గ్రాండ్ ఫెస్టివల్ జరగనుంది. మొదటి రోజు ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు స్టీఫెన్ దేవస్సీ మరియు అతని బృందంచే హై-ఎనర్జీ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. రెండవ రోజు ISB విద్యార్థుల కళాత్మక ప్రతిభను ప్రదర్శిస్తారు. అనంతరం నేపథ్య గాయకులు రూపాలి జగ్గా మరియు అభిషేక్ సోని నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ రాఫిల్ డ్రా. జయానీ మోటార్స్ అందించిన MG కారు మొదటి బహుమతిగా ఉంటుంది. మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జనవరి 18న డ్రా జరగనుంది. టిక్కెట్ల ధర రెండు దినార్లు. వచ్చిన మొత్తాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల ఆర్థిక సహాయం మరియు ఉద్యోగుల సంక్షేమానికి కేటాయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









