మరో 38 సంస్థల ప్రైవేటైజేషన్ కు అంతా సిద్ధం..సౌదీ నిర్ణయం
- September 20, 2020
సౌదీ: పలు ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సౌదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కింగ్డమ్ లోని మరో 38 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయించింది. రెండేళ్లలో ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయనుంది. పర్యావరణం, నీరు, వ్యవసాయం, రవాణా, విద్యుత్, పరిశ్రమలు, మినరల్ వాటర్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలతో పాటు హౌసింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలు కూడా ఉన్నాయి. ప్రైవేటీకరణకు సంబంధించి విధివిధినాలను ఖరారు చేయనున్నట్లు ఓకజ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఓకజ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేటీకరణ ప్రణాళికల పరిధిలో ఉన్న ప్రభుత్వ సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి. సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్, ఇరిగేషన్ కార్పొరేషన్, ధాన్యాల సంస్థ, వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం, వాతావరణ శాస్త్ర జాతీయ కేంద్రం, వృక్షసంపద అభివృద్ధి, వన్యప్రాణి అభివృద్ధి కేంద్రం, పర్యావరణ నియంత్రణ కేంద్రం, జాతీయ నీటి కంపెనీ, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పోర్ట్స్ అథారిటీ, విమానయాన సంస్థ, రైల్వే కార్పొరేషన్, అణు పునరుత్పాదక శక్తి కోసం కింగ్ అబ్దుల్లా సిటీతో మరికొన్ని సంస్థలు ప్రైవేటీకరణ పరిధిలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









