భారతీయులకు 16 దేశాలు వీసాలు అవసరం లేదు
- September 23, 2020న్యూ ఢిల్లీ:భారతీయ ప్రయాణికులకు 16 దేశాల నుంచి శుభవార్త వచ్చింది. ఎలాంటి వీసా అనుమతి లేకుండానే తమ దేశం రావచ్చని పేర్కొన్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ జాబితాలో భూటాన్,నేపాల్,మాల్దీవ్స్, మారిషస్, నియు ద్వీపం,డొమినికా, మోంట్సెరాట్, సెయింట్ విన్సెంట్,సెర్బియా,గ్రెనడిన్స్, సమోవా, సెనెగల్,హైతి,హొంగ్ కాంగ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ఉన్నాయి.
వీటితో పాటు సాధారణ వీసా కలిగిన భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా కొన్ని దేశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. వీటిలో మయన్మార్, ఇరాన్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. మలేసియా,శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ