ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలతో ప్రాంతీయ సమతుల్యతకు మేలు

- September 23, 2020 , by Maagulf
ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలతో ప్రాంతీయ సమతుల్యతకు మేలు

మనామా:బహ్రెయినీ క్రౌన్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలు, ప్రాంతీయ సమతౌల్యం కోసమని అన్నారు. బహ్రెయిన్‌ రాయెల్‌ అలాగే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. ప్రిన్స్‌ సల్మాన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. గత వారం బహ్రెయిన్‌ అలాగే యూఏఈ, ఇజ్రాయెల్‌తో యూఎస్‌ మధ్యవర్తిత్వం నడుమ ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com