కరోనాతో కేంద్ర మంత్రి సురేష్ అంగాడి కన్నుమూత
- September 23, 2020న్యూ ఢిల్లీ:కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. ఈ నెల 11న ఆయనకి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో ఇవాళ చికిత్స పొందుతూ.. ఢిల్లీ ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు.
సురేష్ అంగడి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కర్ణాటకలోని బెళగావి పార్లమెంట్ నియోజకవర్గం నుండి సురేష్ అంగాడి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన సురేష్ అంగాడి మొన్న ఎన్నికల్లో గెలిచాక మోడీ క్యాబినెట్ లో సహాయ మంత్రి పదవి పొందారు. ఇక కేంద్రంలో మంత్రి హోదాలో చనిపోయిన వారిలో ఈయనే ప్రధములు. కొందరు ఎంపీలు రాష్ట్రాల మంత్రులు చనిపోయినా కేంద్ర క్యాబినెట్ కి సంబంధించి ఈయన మరణమే మొదటిది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ