కరోనాతో కేంద్ర మంత్రి సురేష్ అంగాడి కన్నుమూత
- September 23, 2020న్యూ ఢిల్లీ:కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. ఈ నెల 11న ఆయనకి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో ఇవాళ చికిత్స పొందుతూ.. ఢిల్లీ ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు.
సురేష్ అంగడి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కర్ణాటకలోని బెళగావి పార్లమెంట్ నియోజకవర్గం నుండి సురేష్ అంగాడి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన సురేష్ అంగాడి మొన్న ఎన్నికల్లో గెలిచాక మోడీ క్యాబినెట్ లో సహాయ మంత్రి పదవి పొందారు. ఇక కేంద్రంలో మంత్రి హోదాలో చనిపోయిన వారిలో ఈయనే ప్రధములు. కొందరు ఎంపీలు రాష్ట్రాల మంత్రులు చనిపోయినా కేంద్ర క్యాబినెట్ కి సంబంధించి ఈయన మరణమే మొదటిది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం