మరోసారి లాక్ డౌన్ అంటూ ప్రచారం..కొట్టిపారేసిన యూఏఈ మంత్రిత్వ శాఖ
- September 27, 2020
యూఏఈ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధిస్తోదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. అధికారిక ట్విట్టర్లో ఈ విషయాన్ని షేర్ చేస్తూ...సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది. కింగ్డమ్ లో రోజు రోజుకీ వైరస్ తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధిస్తోందని, ఆదివారం నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుందని, ప్రజలు అందరూ బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే..ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ప్రభుత్వం లాక్ డౌన్ విధించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పౌరులు, ప్రవాసీయులు అధికారిక వర్గాల నుంచి వెలువడే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







