మస్కట్: బయల్దేరే ముందే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని IATA సూచనలు
- September 27, 2020
మస్కట్:కోవిడ్ ప్రభావంతో అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలైపోయింది. విమానయాన రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా పలు అంతర్జాతీయ సంఘాలు, సంస్థలు ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నాయి. అదే సమయంలో ప్రయాణికుల ఆరోగ్య భద్రతపై కూడా పకడ్బందీ జాగ్రత్తలను అనుసరిస్తున్నాయి. అయితే.. ప్రయాణికుల విషయంలో ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనురిస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రయాణికులు తమ దేశంలోకి వచ్చాక కోవిడ్ పరీక్షలు నిర్వహించి..ఫలితాలు వచ్చే వరకు వారిని క్వారంటైన్ లో ఉంచుతున్నాయి. అయితే..దీనికి ప్రత్యామ్నాంగా ప్రయాణికులు బయల్దేరే ముందే ఖచ్చితమైన ఫలితాలతో కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం సూచించింది. ప్రయాణికులకు సులువుగాను విమాన ప్రయాణాలను సులభంగా మార్చే క్రమంలో వైద్య నిపుణులు..అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థతో కలసి కార్యచరణ రూపొందించుకుంటున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి కూడా క్వారంటైన్ కు ప్రత్యామ్నంగా ప్రయాణికులకు ముందుగానే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అభిప్రాయపడింది. ఇదిలాఉంటే కోవిడ్ ప్రభావంతో ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 5.6 బిలియన్లు తగ్గిందని..దీంతో 104.5 బిలియన్ డాలర్ల ఆదాయం కొల్పోయినట్లు అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి వివరించింది. విమాన రంగంలోని 60 ఉద్యోగులపై దీని ప్రభావం పడిందని తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







