భారతీయుల కోసం 270 రీపాట్రియేషన్‌ విమానాలు

- September 29, 2020 , by Maagulf
భారతీయుల కోసం 270 రీపాట్రియేషన్‌ విమానాలు

న్యూ ఢిల్లీ:భారత మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, మొత్తం 270 రీపాట్రియేషన్‌ విమానాల్ని యూఏఈ నుంచి ఇండియాకి అక్టోబర్‌లో నడపనుంది.అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 25 వరకు ఈ విమానాలు నడుస్తాయి.రిపాట్రియేషన్‌ మిషన్‌ ఏడో ఫేజ్‌లో భాగంగా (వందే భారత్‌ మిషన్‌) వీటిని నడపనున్నారు.ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఈ విమానాల్ని నడుపుతుంది.అవసరమైతే ఇతర ఇండియన్‌ క్యారియర్స్‌ కూడా విమానాల్ని నడుపుతాయి.అబుధాబి,దుబాయ్‌ మరియు షార్జా నుంచి విమానాలు నడుస్తాయని మినిస్ట్రీ పేర్కొంది.రిరవ్స్‌ డైరెక్షన్‌లో 269 విమానాలు ఇండియా నుంచి యూఏఈకి నడుస్తాయి.యూఏఈలో పనిచేస్తున్న భారతీయుల్ని ఇండియా నుంచి యూఏఈకి తరలించేందుకు వీటిని వినియోగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com