బహ్రెయిన్:మనీ లాండరింగ్ కు పాల్పడిన వ్యాపారవేత్తకు ఏడేళ్ల జైలు శిక్ష

- September 30, 2020 , by Maagulf
బహ్రెయిన్:మనీ లాండరింగ్ కు పాల్పడిన వ్యాపారవేత్తకు ఏడేళ్ల జైలు శిక్ష

మనామా:అక్రమ లావాదేవీలు, ఆస్తుల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారవేత్తకు బహ్రెయిన్ అప్పీల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు BD1,00,000 జరిమానా విధించింది. డబ్బులు చెల్లించకుంటే దానికి సమానమైన అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది. బహ్రెయిన్ కు చెందిన వ్యాపారవేత్త..సౌదీకి చెందిన వ్యక్తిని దాదాపు BD3 మిలియన్లు మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావటంతో అతనికి శిక్షను ఖరారు చేసింది. బహ్రెయిన్ లోని ఓ ఆఫీస్ బిల్డింగ్ ను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సౌదీ వ్యక్తికి విక్రయించాడు. మోసపోయిన సౌదీ వ్యక్తి డబ్బులు చెల్లించిన తర్వాత అతను కొన్న బిల్డింగ్ వేరే వ్యక్తులదని...తనకు ఇచ్చిన డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే..శిక్షపడిన వ్యాపారవేత్త గతంలోనూ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. బహ్రెయిన్ నుంచి పారిపోయిన అతను పలు దేశాల్లో భవనాలు, నైట్ క్లబ్స్, స్టాక్స్ కొన్నాడని తెలిపారు. అయితే..విదేశాల్లోని ఆస్తుల్లో చాలావరకు కొల్పోయిన తర్వాత తిరిగి బహ్రెయిన్ కు చేరుకున్నాడు. 2008లో అతను అక్రమాలకు పాల్పడి సంపాదించిన BD3 మిలియన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com