భారత ప్రధానితో ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు..పరస్పర సహకారంపై చర్చ
- September 30, 2020
రియాద్:సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజిజ్..భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సౌదీ-భారత్ పరస్పర సహకారం, అభివృద్ధి వ్యూహాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలతో పాటు సౌదీ-భారత్ వ్యూహాత్మక మండలి ద్వారా అభివృద్ధి కార్యచరణపై సమీక్షించినట్లు వివరించారు. గతేడాది సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ న్యూ ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, విద్యుత్, సైనిక రంగాలకు సంబంధించి సహకరించుకునేలా పరస్పర అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







