భారత ప్రధానితో ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు..పరస్పర సహకారంపై చర్చ
- September 30, 2020
రియాద్:సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజిజ్..భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సౌదీ-భారత్ పరస్పర సహకారం, అభివృద్ధి వ్యూహాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలతో పాటు సౌదీ-భారత్ వ్యూహాత్మక మండలి ద్వారా అభివృద్ధి కార్యచరణపై సమీక్షించినట్లు వివరించారు. గతేడాది సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ న్యూ ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, విద్యుత్, సైనిక రంగాలకు సంబంధించి సహకరించుకునేలా పరస్పర అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







