భారత ప్రధానితో ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు..పరస్పర సహకారంపై చర్చ

- September 30, 2020 , by Maagulf
భారత ప్రధానితో ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు..పరస్పర సహకారంపై చర్చ

రియాద్:సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజిజ్..భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సౌదీ-భారత్ పరస్పర సహకారం, అభివృద్ధి వ్యూహాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలతో పాటు సౌదీ-భారత్ వ్యూహాత్మక మండలి ద్వారా అభివృద్ధి కార్యచరణపై సమీక్షించినట్లు వివరించారు. గతేడాది సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ న్యూ ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, విద్యుత్, సైనిక రంగాలకు సంబంధించి సహకరించుకునేలా పరస్పర అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com