పాడైపోయిన ఆహార విక్రయం: ప్రముఖ మక్కా కంపెనీపై చర్యలు

- October 01, 2020 , by Maagulf
పాడైపోయిన ఆహార విక్రయం: ప్రముఖ మక్కా కంపెనీపై చర్యలు

రియాద్: ఓ ప్రముఖ కేటరింగ్‌ కంపెనీ మక్కా బ్రాంచ్‌ పాడైపోయిన ఆహారాన్ని విక్రయిస్తున్న నేపథ్యంలో సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ తగిన చర్యలు తీసుకుంది. మక్కా క్రిమినల్‌ కోర్టు జారీ చేసిన తీర్పుని మినిస్ట్రీ పబ్లిష్‌ చేసింది. సదరు సంస్థకి 30,000 రియాల్స్‌ జరీమానా విధించింది న్యాయస్థానం. రెండు వార్తా పత్రికల్లో ఈ తీర్పుని ప్రచురించడం ద్వారా కంపెనీ పరువుని బజార్న పడేయడం జరిగింది. బతా కురైష్‌ జిల్లాలో వున్న హెడ్‌ క్వార్టర్స్‌లో ఇన్‌స్పెక్షన్‌ బృందాలు తనిఖీలు చేయగా, అక్కడ వారికి అక్రమాలఱు కనిపించాయి. పాడైపోయిన ఆహార పదార్థాల్ని తిరిగి వినియోగిస్తున్నట్లుగా గుర్తించి, వాటిని ధ్వంసం చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com