పాడైపోయిన ఆహార విక్రయం: ప్రముఖ మక్కా కంపెనీపై చర్యలు
- October 01, 2020
రియాద్: ఓ ప్రముఖ కేటరింగ్ కంపెనీ మక్కా బ్రాంచ్ పాడైపోయిన ఆహారాన్ని విక్రయిస్తున్న నేపథ్యంలో సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తగిన చర్యలు తీసుకుంది. మక్కా క్రిమినల్ కోర్టు జారీ చేసిన తీర్పుని మినిస్ట్రీ పబ్లిష్ చేసింది. సదరు సంస్థకి 30,000 రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. రెండు వార్తా పత్రికల్లో ఈ తీర్పుని ప్రచురించడం ద్వారా కంపెనీ పరువుని బజార్న పడేయడం జరిగింది. బతా కురైష్ జిల్లాలో వున్న హెడ్ క్వార్టర్స్లో ఇన్స్పెక్షన్ బృందాలు తనిఖీలు చేయగా, అక్కడ వారికి అక్రమాలఱు కనిపించాయి. పాడైపోయిన ఆహార పదార్థాల్ని తిరిగి వినియోగిస్తున్నట్లుగా గుర్తించి, వాటిని ధ్వంసం చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







