ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు...మాస్క్ తీసేసి.!
- October 06, 2020
కోవిడ్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా వరకు కోలుకున్నారు. వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ లో నాలుగు రోజుల పాటు అత్యవసర చికిత్స పొందిన అనంతరం ఆయన తిరిగి వైట్ హౌస్ చేరుకున్నారు. అయితే వైట్ హౌస్ కి వెళ్లగానే ట్రంప్ మాస్క్ తీసేసి కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడారు.
'ఇప్పుడే వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ నుండి వచ్చాను. ఈ సందర్భం నిజంగా చాలా ప్రత్యేకమైనది' అని ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనా గురించి చాలా తెలుసుకున్నానని, ఒక్క విషయం మాత్రం కచ్ఛితంగా గుర్తు పెట్టుకోవాలని. కరోనాని మనపై గెలుపు సాధించనీయకూడదని అన్నారు. కరోనాకు భయపడకూడదని, దానిని జయించవచ్చని. ఈ మధ్యకాలంలో మంచి మందులు, వైద్య సాధనాలు అందుబాటులోకి వచ్చాయని, తప్పకుండా మనం దానిని జయించగలమని. ట్రంప్ చెప్పారు.
'నా ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని తెలిసినా. నాయకుడిగా ముందుండి నడిపించాను, ఏ నాయకుడు అలా చేయడు. ప్రమాదం ఉందని నాకు తెలుసు. అయినా సరే నేను చేయాల్సింది చేశాను. ఇప్పుడు నేను బాగున్నాను. నాకు రోగనిరోధక శక్తి బాగా ఉండి ఉండవచ్చు.' అన్నారాయన.
ట్రంప్ కి చికిత్స చేసిన వైద్య బృందం ఈ విషయంపై స్పందిస్తూ. ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అయితే ఇంటికి వెళ్లగల స్థితిలో ఉన్నారని, ఆయన ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉందని. ఐదవ డోస్ రెమ్ డెసివిర్ ని వైట్ హౌస్ లోనే తీసుకుంటారని తెలిపారు. అక్టోబర్ 15న మియామిలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జో బిడెన్ తో జరగనున్న అధ్యక్ష చర్చలో పాల్గొనాలని ట్రంప్ భావిస్తున్నారని ఆయన ప్రచార ప్రతినిధి టిమ్ ముర్తాగ్ తెలిపారు.
— Donald J. Trump (@realDonaldTrump) October 5, 2020
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు